లోన్ యాప్ వేధింపులతో ఐటీ ఎంప్లాయ్ సూసైడ్

లోన్ యాప్ వేధింపులతో ఐటీ ఎంప్లాయ్ సూసైడ్

 జీడిమెట్ల, వెలుగు : లోన్ యాప్​వేధింపులు తట్టుకోలేక ఐటీ ఎంప్లాయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  బాచుపల్లి పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన వీరవర్ధన్​(33), బాచుపల్లి కౌసల్య కాలనీలోని ఎస్ఎస్ కే అపార్ట్​మెంట్​లో ఉంటూ ఐటీ జాబ్ చేస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు ఉన్నాడు. అతనికి జీతం తక్కువ, ఆర్థిక సమస్యలతో యాప్ లోన్ తీసుకున్నాడు.

 సరిగా కట్టలేకపోతుండగా లోన్​యాప్ వేధింపులు ఎక్కువయ్యాయి.  భార్య డెలివరీ కోసం సొంతూరు వెళ్లగా  ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. యాప్ లోన్ వేధింపులు తీవ్రమవడంతో ఫోన్​సిచ్ఛాఫ్ చేశాడు. అయినా వదలని యాప్​లోన్​నిర్వాహకులు వీరవర్ధన్​పెద్దమ్మకు ఫోన్​చేసి అతని పరువు తీశారు. అతనికి పెద్దమ్మ చెప్పడంతో ఫేక్​కాల్స్​పట్టించుకోవద్దని సూచించాడు. 

ఆమెతోపాటు అతని ఫోన్​లోని పలు నంబర్లకు కాల్స్ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అతడు గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.