సుడాన్​లో అంతర్యుద్ధం.. ఆపరేషన్​ కావేరి

సుడాన్​లో అంతర్యుద్ధం.. ఆపరేషన్​ కావేరి

సుడాన్​ నియంత్రణపై ఆ దేశ సైన్యం, శక్తిమంతమైన పారామిలటరీ దళం మధ్య చెలరేగిన ఘర్షణ ఆ దేశంలో అంతర్యుద్ధానికి దారి తీసింది. ఈ హింసాత్మక ఘర్షణల్లో సుమారు 200 మందికి పైగా మరణించారు. సుడాన్​ ఆర్మీలో ఆ దేశ పారామిలటరీ దళమైన ర్యాపిడ్​ సపోర్ట్​ ఫోర్సెస్​ను విలీనం చేసేందుకు ఆర్మీ చీఫ్​ అబ్దెల్​ ఫత్తా బుర్హాన్​ ప్రతిపాదన చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ మహ్మద్​ హమ్దాన్ దగాలో నేతృత్వంలోని ర్యాపిడ్​ సపోర్ట్​ ఫోర్సెస్​ తిరుగుబాటు చేశాయి. దీంతో దేశంలో అంతర్యుద్ధం తలెత్తింది. 

రాజధాని ఖర్దూమ్​తోపాటు ఓందురుమన్​, పశ్చిమ డార్ఫర్​ ప్రావిన్స్​, ఉత్తర డార్ఫన్​ ప్రావిన్స్​, కస్సాలా ప్రావిన్స్,​ అల్​ ఖదారిఫ్​ ప్రావిన్స్​ల్లో సుడాన్​ ఆర్మీ, ర్యాపిడ్​ సపోర్ట్​ ఫోర్సెస్​ మధ్య తుపాకులు, యుద్ధ ట్యాంకులతో పోరు జరుగుతోంది. సుడాన్​లో చిక్కుకున్న భారతీయ పౌరులు, విదేశీ పౌరులను తరలించడానికి భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్​ కావేరి. పౌరులను వాయు, సముద్ర మార్గం ద్వారా తరలిస్తోంది. పోర్ట్​ సుడాన్​లో ఐఎన్​ఎస్​ సుమేధ ద్వారా భారత నావికాదళం ద్వారా ఎక్కువగా పౌరులను తరలిస్తున్నారు.