
హైదరాబాద్, వెలుగు: తెలంగాణను ప్రపంచం స్కిల్స్ క్యాపిటల్ గా తీర్చిదిద్దుతామని, ఇందు కోసం ప్రతి జిల్లాలో నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ను గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (జీసీసీ) హబ్గా మారుస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. విద్యార్థులకు నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నదని చెప్పారు.
కెనడాకు చెందిన కాన్స్టెలేషన్ సాఫ్ట్వేర్ ఐఎన్సీ అనే సంస్థకు చెందిన డార్క్మ్యాటర్ టెక్నాలజీస్ జూబ్లీహిల్స్లో ఏర్పాటు చేసిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ట్యాలెంట్కు కొదవ లేదని, తక్కువ పెట్టుబడితో అద్భుత ఆవిష్కరణలు చేసే సత్తా ఉందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు జీసీసీలు ఊతమిస్తున్నాయన్నారు.
ఈ ఏడాది వాటి విలువ 4600 కోట్ల డాలర్లుగా ఉంటుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారన్నారు. త్వరలోనే క్వాంటమ్ కంప్యూటింగ్కు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.