ట్రైబల్​ మ్యూజియం పనులు స్పీడప్​ చేయాలి : పీవో బి రాహుల్​

ట్రైబల్​ మ్యూజియం పనులు స్పీడప్​ చేయాలి :  పీవో బి రాహుల్​

భద్రాచలం, వెలుగు: ట్రైబల్​ మ్యూజియం పనులను స్పీడప్​ చేయాలని ఐటీడీఏ పీవో బి రాహుల్​ ఆదేశించారు. సోమవారం ట్రైబల్​ మ్యూజియంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల పండుగలు, పూజా విధానాలు, దేవతామూర్తుల గురించి చిత్రపటాల ద్వారా పర్యాటకులకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యాటకులకు కనువిందు చేసేలా మ్యూజియంను ముస్తాబు చేయాలన్నారు. 

కోయ, నాయకపోడ్, కొండ రెడ్లు, గోర్​ బంజారా(లంబాడా) తెగల దేవతామూర్తులను ప్రత్యేకంగా ప్రతిష్ఠించాలన్నారు. ఆదివాసీల వేట విధానం, పాతకాలపు పనుల పెయింటింగ్స్  వేయించాలన్నారు. అనంతరం మీటింగ్ హాల్​లో జరిగిన గిరిజన దర్బార్​లో వివిధ సమస్యలపై గిరిజనుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. సమస్యలను పరిష్కరించి, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని తెలిపారు.