నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలి : ఐటీడీఏ పీవో రాహుల్​

నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలి : ఐటీడీఏ పీవో రాహుల్​

భద్రాచలం, వెలుగు :  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ట్రైబల్​ వెల్ఫేర్​ గురుకుల పాఠశాలలు, ఏకలవ్య మోడల్​ రెసిడెన్షియల్​ స్కూళ్లకు నాణ్యతతో కూడిన వంట సరుకులు, సీజనల్​ పండ్లను సరఫరా చేయాలని ఐటీడీఏ పీవో రాహుల్ అధికారులను ఆదేశించారు. మీటింగ్​ హాలులో శుక్రవారం టెండర్లను ఓపెన్​ చేశారు. జిల్లా పర్చేజ్​ కమిటీ, డీడీ, ఏపీవో జనరల్​, ఏజన్సీ యజమానుల సమక్షంలో టెండర్ల ప్రక్రియను నిర్వహించారు. 19 గురుకుల పాఠశాలలు, 8 ఏకలవ్య స్కూళ్లలో చదివే స్టూడెంట్లకు పౌష్టికాహారం అందించాలన్నారు. 114 మంది టెండర్లలో పాల్గొనగా, తక్కువగా కోడ్​ చేసిన ఏజన్సీలకే టెండర్లను అప్పగించినట్లు పీవో తెలిపారు.