ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలె : జేఏసీ నాయకులు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలె : జేఏసీ నాయకులు
  • నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగుల నిరసన

భైంసా, వెలుగు: ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో వెంటనే విలీనం చేసే చర్యలు చేపట్టాలని జేఏసీ నాయకులు డిమాండ్​ చేశారు. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఆయా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం భైంసాలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుదీర్ఘం కాలంగా పెండింగ్​లో ఉన్న తమ సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పని భారాలు తగ్గించడంతో పాటు వెల్ఫేర్​ కమిటిలను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. 

ట్రేడ్​ యూనియన్లను పునరుద్ధరించి, పెండింగ్​లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జేఏసీ నాయకులు గంగయ్య, స్వరూప్, కుంటాల ముత్యం, బాబు, సుధాకర్, ఎల్ఎస్​గౌడ్, నిరోష, కళ తదిత రులు పాల్గొన్నారు.