
పంజాగుట్ట, వెలుగు: మిలియన్మార్చ్డేను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ డిమాండ్చేసింది. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జేఏసీ చైర్మన్యాదగిరి, సభ్యులు కంచర్ల భద్రి , తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు మోహన్ బైరాగి మీడియాతో మాట్లాడారు.
సీమాంధ్ర దోపిడీ పాలనపై తెలంగాణ తిరుగుబాటు జెండా ఎగరేసిన రోజు మార్చి 10 అని, ఆ దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. 10న మిలియన్మార్చ్డే నిర్వహిస్తున్నామన్నారు. ట్యాంక్ బండ్అమరజ్యోతి నుంచి గన్పార్క్వరకు ర్యాలీ ఉంటుందని, ప్రతిఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.