
దుబ్బాక, వెలుగు: నియోజక వర్గ కేంద్రమైన దుబ్బాకను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని రెవెన్యూ డివిజన్ జేఏసీ ప్రతినిధులు సోమవారం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. దుబ్బాక రెవెన్యూ డివిజన్ కోసం 2016 నుంచి ఎదురు చూస్తున్నారని, అన్ని అర్హతలున్న దుబ్బాకను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని కోరారు.
3ఈ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని ఎంపీ తెలిపారు. ఎంపీని కలిసిన వారిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళి, జీడిపల్లి రవి, చింతల కృష్ణ, జేఏసీ సభ్యులు మాడబోయిన శ్రీకాంత్, రేపాక భాను, చింత సంతోష్, కడవేర్గు రాజేందర్ తదితరులు ఉన్నారు.