
- అప్పట్లో తెలంగాణ పేరెత్తితే నక్సలైట్ల పేరుతో కాల్చి చంపారు: జగదీశ్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణను ఆంధ్రాలో కలి పింది కాంగ్రెస్ పార్టీయేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆరోపించారు. అప్పట్లో తెలం గాణ పేరెత్తితే నక్సలైట్ల పేరు చెప్పి కాల్చి చంపిందన్నారు. కేసీఆర్ను తిడుతున్న వాళ్లు నాడు సమైక్యాంధ్ర తొత్తుల కింద పనిచేశారన్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ విలన్గానే ఉంటుందన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర ప్రగల్భాలు ఆపాలన్నారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం కొన్నారు? ఎంత బోనస్ ఇచ్చారు? చెప్పాలని, లేకపోతే రండలేనని అన్నారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ నిజమని నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు.