
హైదరాబాద్: ‘కేసీఆర్పదేండ్లలో 20 వేల కోట్లు రుణమాఫీ చేస్తే.. రేవంత్రెడ్డి సర్కార్ఏడాదిలోనే 22 వేల కోట్లను మాఫీ చేసింది.. పదేండ్లలో వాళ్లు చేస్తే.. మేం ఏడాదిలోనే చేశాం. కేసీఆర్గొప్పోడా.. లేదా రేవంత్రెడ్డి గొప్పోడా.. ? ప్రజలు ఆలోచించాలి. రుణమాఫీ మీద డిబేట్కు కేసీఆర్ఎక్కడికి వస్తాడో చెప్పాలి. ఏ బాయి కాడికి, ఏ రచ్చబండ దగ్గరికి వచ్చిన సరే.. నేను సిద్దమే’ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్జగ్గారెడ్డి అన్నారు.
ఇవాళ గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మహిళలు ఫ్రీ జర్నీ చేస్తే కేసీఆర్ఓర్వ లేక ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. ‘ మేము అడ్డుకుంటే బీ ఆర్ ఎస్ సభ నడిచేదా? బీఆర్ ఎస్ నాయకులు డాన్స్ లు చేసే వారా? కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికి స్వేచ్ఛ దొరికింది. సచివాలయంలోకి అందరూ స్వేచ్ఛగా పోతున్నారు. కేసీఆర్ హాయంలోకి ఎవ్వరిని పోనియ్యలేదు’ అని జగ్గారెడ్డి అన్నారు.
►ALSO READ | డీపీఆర్లో ఒకటి చెప్పి.. మరో చోట బ్యారేజీలు కట్టారు..కేసీఆర్ ఏది చెబితే అదే చేశారు: ఉత్తమ్