
జమ్ముకశ్మీర్ను పునర్విభజన చట్టం–2019 ప్రకారం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. 1. జమ్ము కశ్మీర్, 2. లఢక్. గతంలో ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా డామన్ డయ్యూలు ఉండేవి. 2020 జనవరిలో దాద్రానగర్ హవేలిలో కలిపేశారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి దాద్రానగర్ హవేలి, డామన్ డయ్యూగా పేరు పెట్టారు.
లఢక్: జమ్ముకశ్మీర్ పునర్విభజన చట్టం– 2019 ప్రకారం, జమ్ముకశ్మీర్, లఢక్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. లఢక్ కేంద్రపాలిత ప్రాంతంలో కార్గిల్, లేహ్ జిల్లాలు ఉన్నాయి. ఇది కారకోమ్, జాస్కార్ శ్రేణుల మధ్య విస్తరించి ఉంది. లఢక్ను పాలించిన మొదటి రాజు పాల్గాయి–గోన్. దీని వైశాల్యం 96,751 చదరపు కి.మీ. రాజధాని లేహ్. 2011 జనాభా లెక్కల ప్రకారం లఢక్ జనాభా 2.74 లక్షలు. భారత్లో అతిపెద్ద జిల్లా లేహ్. దీని వైశాల్యం 82,665 చ.కి.మీ. ఇందులో 37,555 చ.కి.మీ చైనా ఆక్రమించుకుంది. లఢక్ మొదటి లెఫ్టినెంట్ గవర్నర్ రాధా కృష్ణమాథూర్. టిబెట్కు ఏ భాషా, లిపి ఉంటుందో లఢక్కి అదే ఉంటుంది. ఈ ప్రాంతంలో వివిధ మాండలిక భాషలు ఉన్నాయి. అవి లఢకి, పుర్గి, బాల్టి, షిన, డార్డి. ‘కుషోక్ బాకూలా రిమ్పోచే’ విమానాశ్రయం సముద్ర మట్టం నుంచి 3,256 మీటర్ల ఎత్తులో ఉంది. లఢక్లో సుమోరిరి, ప్యాంగ్గాంగ్, కార్గిల్ పెన్సిలా సరస్సులు ఉన్నాయి. హెమిస్, థిక్స్సే, ఆల్చి, ముల్బెక్, రాంగ్డమ్ అనే మఠాలు ఉన్నాయి.
లఢక్లో నుభ్రా, సురూ లోయలు ఉన్నాయి. నున్కున్, స్టోక్ కాంగ్రి అనే ఎత్తైన శిఖరాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో సింధు, గిల్జిట్, జాస్కార్, షైయొక్, ఆస్టర్ నదులు ప్రవహిస్తున్నాయి. దేశంలో అధికంగా ఆఫ్రికాట్ను ఉత్పత్తి చేసేది లఢక్. ఈ ప్రాంతంలోనే జొజిల్లా సొరంగం ఉంది.
జమ్ముకశ్మీర్: 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్ముకశ్మీర్ జనాభా 1.25 కోట్లు. ఈ ప్రాంతానికి మొదటి లెఫ్టినెంట్ గవర్నర్ గా గిరీష్ చంద్ర ముర్ము నియమితులయ్యారు. అశోకుడు క్రీ.పూ.3వ శతాబ్దంలో కశ్మీర్లో బౌద్ధమతాన్ని ప్రవేశపెట్టాడు. మహారాజా హరిసింగ్ భారత యూనియన్కు అనుకూలంగా ‘ఇన్యూట్రుమెంట్ ఆఫ్ ఆక్సెసన్’ మీద 1947 అక్టోబర్ 26లో సంతకం చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్లో శాసనసభ ఉంటుంది. కానీ శాసనమండలి ఉండదు. జమ్ముకశ్మీర్లో ప్రాథమిక భాషలుగా ఉర్దూ, డోగ్రి, కశ్మీరీ, పహరి, పంజాబీ, లఢక్, బాల్టి, గోజ్రి, డాద్రి ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే ఉలార్ సరస్సు ఉంది. కిషెన్గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ సైతం ఇక్కడే ఉంది.
నాగాలాండ్: 1963లో 16వ రాష్ట్రంగా నాగాలాండ్ ఏర్పడింది. ఇక్కడ అంగామి, ఆవో, చాకేసాంగ్, చాంగ్, కుకి, కొన్యాక్, కచారి, లోథ్, పోమ్, పొచూరి, రెంగ్మా, సంఘటమ్, సుమి, యుమిచుంగ్రి, జెలియాంగ్ అనే తెగలు ఉన్నాయి. 1961లో నాగాలాండ్ అని పేరు పెట్టినా అధికారికంగా 1963 డిసెంబర్లో నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడింది. రంగపహర్, షాకిమ్, సింగ్ఫాన్ అనే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలతో పాటు ఇంటాకి అనే జాతీయ పార్క్ ఇక్కడ ఉంది. హార్న్బిల్ పండుగ నాగాలాండ్లో ప్రసిద్ధి చెందింది. ‘సరామతి’ అనే శిఖరం నాగాలాండ్లో అతి ఎత్తైనది.
మేఘాలయ:1970లో అసోంలో స్వతంత్ర ప్రతిపత్తిగల రాష్ట్రంగా ఉన్న మేఘాలయ, 1972లో పూర్తి రాష్ట్రంగా ఏర్పడింది. ఖాసీ, జంయతియా, గారో అనే తెగలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. తూర్పు నుంచి పడమరకు వరుసగా జయంతియా, ఖాసి, గారో అనే కొండలు ఉన్నాయి. నాక్రేక్ శిఖరం ఈ రాష్ట్రంలోనే ఉంది. నాక్రేక్, బల్పక్రాయ్ జాతీయ పార్కులు, నొంగ్ ఖైల్లెమ్, సిజు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు మేఘాలయ రాష్ట్రంలో ఉన్నాయి.
త్రిపుర: 1949 అక్టోబర్లో త్రిపుర రాష్ట్రం భారత యూనియన్లో భాగమైంది. ప్రారంభంలో పార్ట్ సి రాష్ట్రంలో భాగంగా ఉండేది, 1972లో పూర్తి రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ రాష్ట్రంలో బెంగాలి, కొక్బొరొక్ అనే ప్రాథమిక భాషలు ప్రజలు మాట్లాడుతారు. త్రిపుర రాష్ట్రంతో బంగ్లాదేశ్, అసోం, మిజోరాం సరిహద్దు కలిగి ఉన్నాయి.
మణిపూర్:1972లో మణిపూర్ పూర్తి రాష్ట్రంగా ఏర్పడింది. ఈశాన్య రాష్ట్రాల్లో రెండో అతిపెద్ద విమానాశ్రయం ఇంపాల్. కైబుల్ లామ్జావో జాతీయపార్క్ ఈ రాష్ట్రంలో ఉంది. లోక్ఢక్ అనే సరస్సు ఈ రాష్ట్రంలో ప్రవహిస్తుంది.
హిమాచల్ ప్రదేశ్: 1971లో హిమాచల్ ప్రదేశ్ 18వ రాష్ట్రంగా ఏర్పడింది. ఈ రాష్ట్రాన్ని ‘ఫ్రూట్భౌల్’ ఆఫ్ ది కంట్రీ అంటారు. హిందీ, పహరి భాషలు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మాట్లాడుతారు.
గోవా: గోవా ప్రాంతం 1961 డిసెంబర్ 19న ఇండియాలో విలీనమైంది. అప్పటి వరకు పోర్చుగీసు వారి అధీనంలో ఉండేది. 1961లో గోవా, డామన్ డయ్యు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉండగా, 1987 మే నెలలో గోవా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. గోవాలో ముర్ముగావో ముఖ్యమైన రేవు పట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 14.59 లక్షలు.
దాద్రా, నగర్ హవేలి అండ్ డామన్ డయ్యూ
వీటి రాజధాని సిల్వసా. వైశాల్యం 603 చ.కి.మీ. ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 5,85,764 జనాభా ఉండేది. గుజరాతీ, హిందీ, ఇంగ్లిష్, పోర్చుగీస్, కొంకణి, వర్లీ ప్రాథమిక భాషలు. . పోర్చుగీసు వారు దాద్రా నగర్ హవేలి ప్రాంతాన్ని 1954 ఆగస్టు 2 వరకు పాలించారు. డయ్యూను ఆక్రమించుకొని 1961 వరకు పరిపాలించారు. దాద్రా, నగర్ హవేలి దేశంలో భూపరివేష్టిత ప్రాంతం. దామన్ గంగా నది నాసిక్ నుంచి ప్రవహిస్తూ డామన్ జిల్లాల మధ్య రెండు భాగాలుగా విడిపోతూ మోతీ డామన్, నాని డామన్ పేర్లతో ప్రవహిస్తున్నాయి.