
- 21 మందికి గాయాలు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో కాలేజీ బస్సు బోల్తాపడి ఇద్దరు స్టూడెంట్లు మృతిచెందారు. మరో 21 మంది గాయపడ్డారు. శనివారం ఉదయం సోగమ్కు చెందిన ప్రభుత్వం డిగ్రీ కాలేజీకి చెందిన 27 మంది స్టూడెంట్లు బస్సులో పిక్నిక్కు బయల్దేదారు. అయితే కొద్ది దూరం వెళ్లాక హంద్వారాలోని వోడ్పోరా సమీపంలో వీరి బస్సు కంట్రోల్ తప్పి బోల్తాపడింది. ప్రమాదంలో గాయపడిన స్టూడెంట్లను హంద్వారాలోని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు తీవ్రంగా గాయపడిన విద్యార్థులు ట్రీట్మెంట్ తీసుకుంటు మృతిచెందారు. మృతుల్లో ఒక అమ్మాయి ఉంది.