సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం

సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం

కాశీబుగ్గ/కాజీపేట/ జనగామ అర్బన్, వెలుగు: సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్, వరంగల్​ ఫుడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా డివిజనల్​ మేనేజర్​ ప్రఖార్​ వర్మ అన్నారు. సోమవారం జనగామ కలెక్టరేట్ లో, కాజీపేట ఫుడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియాలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్​ కట్​ చేసి పంచిపెట్టారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, గేమ్స్​ నిర్వహించారు.

 జనగామలో స్క్రీనింగ్​ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కళ్లద్దాలు అందజేశారు. ​మహిళా శానిటేషన్​ సిబ్బందిని, మున్సిపల్​ మహిళా పారిశుధ్య కార్మికులను శాలువాలతో సత్కరించి, వివిధ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులను ప్రశంసాపత్రాలతోపాటు బహుమతులు అందజేశారు. కార్యక్రమాల్లో జనగామ అడిషనల్​ కలెక్టర్లు పింకేశ్​కుమార్, రోహిత్​ సింగ్, జడ్పీసీఈవో మాధురీ షా, కాజీపేటలో ఏజేఎం కే.ఇందు తదితరులు పాల్గొన్నారు.