జనగామ, వెలుగు: టైమ్కు డ్యూటీకి రాని ఉద్యోగులపై జనగామ కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్కొరడా ఝుళిపించారు. విధుల్లో లేని 25 మందికి షోకాజ్నోటీసులుజారీ చేశారు. శుక్రవారం కలెక్టరేట్లోని వివిధ విభాగాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొంతకాలంగా జిల్లాస్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది డ్యూటీలకు సరిగా రావడం లేదనే ఆరోపణలు వస్తుండగా కలెక్టర్స్పందించారు. దీంతో డుమ్మా కొట్టే, సమయానికి రాని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై కలెక్టర్సీరియస్అయ్యారు.
కలెక్టరేట్లోని ప్రతి విభాగానికి వెళ్లి అటెండెన్స్ రిజిస్టర్లను చెక్ చేశారు. పేర్లను చదువుతూ.. వచ్చారా..? లేదా..? అని అడిగారు. మొత్తం ఎంత మంది సిబ్బంది..? ఆఫీస్కు రానివారు ఎంతమంది అంటూ ఆరా తీశారు. గైర్హాజరైన 25 మంది ఉద్యోగులకు షోకాజ్నోటీసులు ఇవ్వాలని కలెక్టరేట్ఏవో మన్సూర్ను ఆదేశించారు. అనంతరం కలెక్టర్మాట్లాడుతూ.. ఉద్యోగులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. మూవ్మెంట్రిజిస్టర్నిర్వహించాలని సూచించారు.