టెన్త్​ఎగ్జామ్స్​ పకడ్బందీగా నిర్వహించాలి

టెన్త్​ఎగ్జామ్స్​ పకడ్బందీగా నిర్వహించాలి

జనగామ అర్బన్, వెలుగు: టెన్త్​ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహించాలని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లో అడిషనల్​ కలెక్టర్ ​పింకేశ్​కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్​తో కలిసి ఎగ్జామ్స్​నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పది పరీక్షలకు 41 సెంటర్లలో 6238 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు.

 విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అంతకుముందు కలెక్టరేట్​లో అలీంకో సంస్థ సహకారంతో జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 66 మంది దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన ఉచిత సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు.  అనంతరం జనగామ మండల పరిధిలోని మరిగడి ఎంపీపీఎస్​ స్కూల్​ను కలెక్టర్​ ఆకస్మకంగా సందర్శించారు. ఏఐ ఎడ్యుకేషన్​ను పరిశీలించి ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు.