టెన్త్ ఫలితాల్లో జిల్లా ఫస్ట్ ఉండాలి

టెన్త్ ఫలితాల్లో జిల్లా ఫస్ట్ ఉండాలి

జనగామ అర్బన్​, వెలుగు :  పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో జనగామ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు సమిష్టిగా కృషి చేయాలని జనగామ కలెక్టర్​ షేక్​రిజ్వాన్​బాషా అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల హెచ్​ఎం లకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్​లోని కాన్పరెన్స్​ హాల్లో ఒరియేంటేషన్​ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు.  కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ పింకేశ్​ కుమార్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షల్లో స్టూడెంట్లు వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా విజయోస్తు కార్యక్రమం  రూపకల్పన చేశామన్నారు.  ఆ దిశగా హెచ్‌ఎంలు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఓ కే. రాము, కె. రవికుమార్, జి. చంద్రభాను, టి. రాజు, బి. శ్రీనివాస్, గౌసియా, ఎం. రామరాజు, అన్ని మండలాల ఎంఈవోలు, హెచ్​ఎంలు పాల్గొన్నారు.