
బచ్చన్నపేట, వెలుగు: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు అందేలా చూడాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కాంప్లెక్స్వద్ద ఇందిరమ్మ మోడల్హౌజ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పులిగిళ్ల పూర్ణచందర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బాల్రెడ్డి, రైతుబంధు జిల్లా మాజీ కన్వీనర్ రమణారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.