పసిపాపను కిడ్నాప్​ చేసిన నిందితుల అరెస్ట్

పసిపాపను కిడ్నాప్​ చేసిన నిందితుల అరెస్ట్

జనగామ అర్బన్, వెలుగు: జనగామ టౌన్ లో 10 రోజుల కింద కిడ్నాప్ అయిన  చిన్నారి శివాని(10 నెలలు) కేసును జనగామ పోలీసులు ఛేదించారు. కిడ్నాప్​ చేసిన ముగ్గురిని అరెస్ట్​ చేసి పాపను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. మంగళవారం జనగామ పోలీస్​స్టేషన్​లో ఏసీపీ పండరీ చేతన్​ నితిన్​ మీడియాకు వివరాలు వెల్లడించారు. చత్తీస్​గడ్ కు చెందిన రాంజిల్​ రజాక్, పార్వతి దంపతులు జనగామలో కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. 

వీరి కూతురు శివానిని అక్కడే పని చేస్తున్న  సురేశ్, విజయలక్ష్మి దంపతులు కిడ్నాప్​ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.  సీసీ  పుటేజ్ ల ఆధారంగా నిందితులను పెంబర్తి వద్ద పట్టుకున్నారు. విజయవాడకు చెందిన చంద్రమ్మ, గుంటూరుకు చెందిన తిరుపతమ్మ ద్వారా​పిల్లలు లేని వారికి పాపను అమ్మేందుకు కిడ్నాప్​కు పాల్పడినట్లు ఏసీపీ తెలిపారు.