
జనగామ అర్బన్, వెలుగు: వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్తో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పోస్టల్బ్యాలెట్పోలింగ్విధానంపై సెక్టార్అధికారులు, ప్రిసైడింగ్అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోలకు మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో మొత్తం 12 పోలింగ్ కేంద్రాలకు 1,002 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.
పోలింగ్ నిర్వహణకు 17 మంది పీవోలు, 18 మంది ఏపీవోలు, 37 మంది ఓపీవోలు, 18 మంది మైక్రో అబ్జర్వర్లకు విధులు కేటాయించామన్నారు. ఈ నెల 27 న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్నిర్వహించనున్నట్లు తెలిపారు. అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన వాహనంలో సంబంధిత రూట్ల ద్వారానే పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని సూచించారు. అంతకుముందు పోలింగ్విధుల నిర్వహణపై మాస్టర్ ట్రైనర్లు పవర్పాయింట్ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించారు. అంతకుముందు కలెక్టర్ జిల్లా కేంద్రంలోని గీతాంజలి పబ్లిక్ స్కూల్లో పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలపై ప్రేరణ, అవగాహన తరగతుల కార్యక్రమంలో పాల్గొని, పలు సూచనలు చేశారు.