ధాన్యం సేకరణ సజావుగా జరగాలి

ధాన్యం సేకరణ సజావుగా జరగాలి

జనగామ అర్బన్, వెలుగు: ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా జరగాలని, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని, ట్రాకింగ్​​సిస్టం ఉండాలని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​ అన్నారు. యాసంగి 2024-25 కి సంబంధించి ధాన్యం కొనుగోలు పై శనివారం అడిషనల్​ కలెక్టర్​ రోహిత్​ సింగ్​తో కలిసి కలెక్టరేట్​లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ యాసంగికి సంబంధించి జిల్లాలో 3,75,453 మెట్రిక్​ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేయగా, అందులో 2,35,954 మెట్రిక్​టన్నుల ధాన్యం కొనుగోలే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకొని ఈసారి జిల్లాలో 300 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొనుగోలు ప్రక్రియ అయిపోయి మిల్లులకి పోయేంతవరకు ప్రతి నిర్వహకులు ట్రాకింట్​ సిస్టమ్​ను మెయింటైన్​ చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీవో గోపిరాం, డీఆర్డీవో వసంత, డీఎం సివిల్​ సప్లై హతీరామ్, డీఏవో రామారావు నాయక్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టర్​ జిల్లా కేంద్రంలోని సెయింట్​ మేరీస్​స్కూల్, ధర్మకంచ జడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్​ ఎగ్జామ్​ సెంటర్లను పరిశీలించారు.​