
స్టేషన్ఘన్పూర్, వెలుగు: నీతి, నిజాయతీ ఉంటే ఎమ్మెల్యే పదవికి కడియం శ్రీహరి రాజీనామా చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో వచ్చే ఏప్రిల్27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతానికి బుధవారం బీఆర్ఎస్ మండల సన్నాహక సమావేశం జరిగింది.
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి చీఫ్ గెస్ట్గా హాజరై మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు త్యాగాల ఫలితంగానే కడియం శ్రీహరి డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పదవులను అనుభవించారని చెప్పారు. కడియం రాజీనామా చేసేంత వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకునేదిలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య, మాజీ జడ్పీ చైర్మన్ రవి తదితరులు పాల్గొన్నారు.