
జనగామ, వెలుగు: జనగామ మున్సిపాలిటీపరిధిలో మొండి బకాయిల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇంటి, నల్లా పన్నుల వసూళ్లపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. పట్టణంలోని బతుకమ్మకుంటలోని ఓ ఇంటి ముందు శనివారం కమిషనర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ అధికారులతో కలిసి బైఠాయించారు.
ఆరేండ్లుగా ఇంటి పన్ను చెల్లించడం లేదని, పలుమార్లు చెల్లించాలని కోరినా పట్టించుకోవడం లేదని కమిషనర్ తెలిపారు. పన్ను చెల్లించేంత వరకు కదిలేది లేదంటూ అక్కడే కూర్చోవడంతో రూ.7,500 చెల్లించాడని, మిగిలిన బకాయి చెల్లించేందుకు వారం రోజుల గడువు అడిగినట్లు తెలిపారు. మేనేజర్ రాములు, ఆర్వో బాబు, ఆర్ఐ ఏలియా, మధు ఉన్నారు.