ఆస్పత్రి నుంచి జాన్వీ కపూర్ డిశ్చార్జ్

ఆస్పత్రి నుంచి జాన్వీ కపూర్ డిశ్చార్జ్


నటి జాన్వీకపూర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారని ఆమె తండ్రి బోనీ కపూర్ తెలిపారు. 'ఫుడ్ పాయిజన్ కారణంగా గురువారం జాన్వీ అస్వస్థతకు గురైంది. ఆస్పత్రిలో అడ్మిట్ చేసినం. హెల్త్ మెరుగుపడటంతో నిన్న మార్నింగ్ ఇంటికి తీసుకువచ్చాం' అని బోనీ కపూర్ మీడియాతో చెప్పారు. మరోవైపు వరుస సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా జాన్వీకపూర్ దూసుకెళ్తున్నారు. గుల్షన్ దేవయ్య, రోషన్ మ్యాథ్యూతో కలిసి ఆమె నటించిన బాలీవుడ్ మూవీ 'ఉలఝ' వచ్చే నెలలో రిలీజ్ కానుంది.

 దేవరతో టాలీవుడ్లోకి ఆమె ఎంట్రీ ఇస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రమిది. మరోవైపు బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్లో రూపొందబోయే చిత్రంలోనూ హీరోయిన్గా ఆమె ఎంపికైంది. ప్రభాస్తో ఓ సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.