పరారీలో కొరియోగ్రాఫర్​జానీ మాస్టర్

పరారీలో కొరియోగ్రాఫర్​జానీ మాస్టర్

 

గండిపేట: లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ పరారీలో ఉన్నాడని రాజేంద్రనగర్‌ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్‌ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీపై కేసు నమోదు చేశామని, ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడన్నారు. జానీమాస్టర్‌ను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. 

విమెన్​కమిషన్​కు బాధితురాలి ఫిర్యాదు 

సికింద్రాబాద్ : జానీ మాస్టర్​పై తెలంగాణ మహిళ కమిషన్​ కేసు నమోదు చేసింది. తనపై లైంగికదాడి చేశాడంటూ జానీమాస్టర్​పై బాధితురాలితో పాటు మహిళా సంఘాలు బుధవారం రాష్ట్ర మహిళా కమిషన్​ చైర్​పర్సన్​నేరెళ్ల శారదకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చైర్​పర్సన్​శారద మాట్లాడుతూ ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసినందుకు అభినందిస్తున్నానన్నారు. ఆమెకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.