
శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే అతి ముఖ్యమైన హిందూ పండుగలలో జన్మాష్టమి ఒకటి. ఇది భారతదేశం అంతటా అత్యంత భక్తి, శ్రద్దలతో జరుపుకుంటారు. ఆనందం, ఉత్సవాల సమయంగా చెప్పుకునే ఈ రోజు.. ఈ సంవత్సరం, రోహిణి నక్షత్రం అష్టమి తిథి కారణంగా కృష్ణ జన్మాష్టమి వరుసగా సెప్టెంబర్ 6, 7 తేదీలలో జరుపుకోనున్నారు. జన్మాష్టమి అనేది శ్రీకృష్ణుడికి గౌరవంగా జరుపుకునే సమయం.
జన్మాష్టమి సందర్భంగా దైవానికి సమర్పించే పూజలో భోగ్ వస్తువులు అంతర్భాగం. ఈ వస్తువులలో సాంప్రదాయంగా వండే రుచికరమైన వంటకాలు, స్వీట్లు, అలాగే పండ్లు, పువ్వులు ఉంటాయి. ఈ వస్తువులన్నీ ప్రేమ, గౌరవానికి చిహ్నంగా భగవంతుడికి సమర్పిస్తారు. వాటిలో ముఖ్యంగా ఉండేవి..
- మఖన్ మిశ్రీ
- రబ్రీ
- హల్వా
- మోహన్భోగ్
- పెడా
- మాల్పువా
- జీరా లడ్డూ
- ఖీర్
- రసగుల్లా
- జలేబి
ఈ వంటకాలన్నీ ఈ పవిత్రమైన రోజున చాలా జాగ్రత్తగా వండుతారు. వాటికి అదనపు రుచిని జోడించేందుకు వీటికి నెయ్యితో వండుతారు. ఈ భోగ్లో భాగంగా యాపిల్స్, అరటిపండ్లు, దానిమ్మ, ద్రాక్ష, నారింజ వంటి పండ్లను సైతం అందించవచ్చు. ఈ పండ్లు శ్రీకృష్ణునికి ఎంతో ప్రీతికరమైనవని. ఆయన పట్ల భక్తులకు తమకున్న ప్రేమను వ్యక్తీకరించడానికి గొప్ప మార్గం అని నమ్ముతారు.
ఆహార నైవేద్యాలతో పాటు, భోగ్లో భాగంగా పూలనూ సమర్పిస్తారు. జన్మాష్టమి నాడు శ్రీకృష్ణునికి అర్పించడానికి ఎర్ర గులాబీలను ప్రత్యేకంగా భావిస్తారు. గులాబీలే కాకుండా, బంతి పువ్వులు, మోగ్రా, చంపా వంటి ఇతర పువ్వులను కూడా అందించవచ్చు. ఈ పువ్వులు వివిధ మతపరమైన అర్థాలను కలిగి ఉంటాయి, ఇవి ఈ శుభ సందర్భంలో భగవంతుడికి సమర్పించడానికి ఇవి పరిపూర్ణంగా ఉంటాయి.
ఈ వస్తువులే కాకుండా, జన్మాష్టమి నాడు భోగ్లో భాగంగా వెన్న లేదా మజ్జిగ వంటి పాల ఉత్పత్తులను కూడా అందించవచ్చు. ఈ పాల ఉత్పత్తులు శ్రీకృష్ణుడి ఆటతీరును, ఆవుల పట్ల ఆయనకున్న ప్రేమను సూచిస్తాయని నమ్ముతారు. భోగ్లో భాగంగా తాజాగా చేసిన పెరుగు లేదా తియ్యటి పెరుగును కూడా అందించవచ్చు. ఈ సాంప్రదాయ నైవేద్యాలతో పాటు, భోగ్లో బాదం, జీడిపప్పు, వాల్నట్లు మొదలైన డ్రై ఫ్రూట్స్ను కూడా అందించవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నమ్ముతారు. జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుడికి ఇవి అందించడం గొప్ప నైవేద్యంగా భావిస్తారు.