
దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ 2023) నోటిఫికేషన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.
రెండు విడతల్లో ఎగ్జామ్ నిర్వహించనున్నారు. తొలి విడత 2023 జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో ఉంటుంది. రెండో విడత జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు ఉంటాయి. పరీక్ష ఆన్లైన్ విధానంలో మొత్తం 13 భాషల్లో జరగనుంది.
అప్లికేషన్స్: జేఈఈ మెయిన్స్ మొదటి విడత అప్లికేషన్స్ డిసెంబర్ 15 నుంచి జనవరి 12 వరకు స్వీకరిస్తారు. ఏప్రిల్లో జరిగే రెండో విడత పరీక్షలకు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటారు. మెయిన్స్లో అర్హత సాధించిన వారికి అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులకు అందులో వచ్చే ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయింపు ఉంటుంది. విద్యార్థులు పూర్తి వివరాల కోసం www.jeemain.nta.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.