ఫేక్​ డాక్యుమెంట్లతో కబ్జాలు.. బీఆర్ఎస్​ నాయకురాలు అరెస్ట్

ఫేక్​ డాక్యుమెంట్లతో కబ్జాలు.. బీఆర్ఎస్​ నాయకురాలు అరెస్ట్

జీడిమెట్ల, వెలుగు: ఫేక్ ల్యాండ్​డాక్యుమెంట్స్, ఆధార్​కార్డులు, పాన్​కార్డులు సృష్టించి రూ.కోట్ల ప్లాట్స్​కబ్జా చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్​చేసి రిమాండ్​కి తరలించారు. బాలానగర్​డీసీపీ కె.సురేశ్​కుమార్​శుక్రవారం డీసీపీ ఆఫీసులో వివరాలు వెల్లడించారు. ఉప్పుగూడకు చెందిన నంద్యాల సురేశ్​కుమార్​20 ఏండ్ల కిందట కుత్బుల్లాపూర్​సుభాష్​నగర్​లో 200 గజాలు కొన్నాడు. సంవత్సరానికి ఒకసారి వచ్చి జాగా చూసుకుని వెళ్లేవాడు. స్థలంపై సుభాష్​నగర్​కి చెందిన బీఆర్ఎస్​మహిళా లీడర్ పద్మజారెడ్డి అలియాస్​కుత్బుల్లాపూర్​పద్మక్క కన్నుపడింది. భూమి కబ్జా చేయడానికి ప్రణాళిక రచించింది.

 ఇందులో భాగంగా ఫేక్​డ్యాకుమెంట్స్​తయారీలో నిపుణుడైన హయత్​నగర్​కి చెందిన కరుణాకర్​ను సంప్రదించింది. రూ.3.50 లక్షలు ఇవ్వడంతో అతడు ఫేక్​డ్యాకుంమెంట్స్​తోపాటు, ల్యాండ్​ఓనర్​సురేశ్​1992లో చనిపోయినట్లు ఫేక్​డెత్​సర్టిఫికెట్, లీగర్​హెయిర్ సర్టిఫికెట్​సృష్టించి ఆమెకు ఇచ్చాడు. ఈ ఫేక్​డాక్యుమెంట్స్​తో ఫిబ్రవరి2023లో కుత్బుల్లాపూర్​ఎస్ఆర్ఓ ఆఫీస్​లో రిజిస్ట్రేషన్​చేయించింది. అసలు ఓనర్​ప్లాట్​వద్దకు వెళ్లగా అతన్ని బెదిరించి పంపించివేశారు. 

దీంతో బాధితుడు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరిపి మేకల హరీశ్​సాయంతో ఆధార్​ కేంద్రంలో పనిచేసిన గగణం నరేంద్ర అలియాస్​నందు సహకారంతో రవిశంకర్​వారసుడుగా ఫేక్​ఆధార్​కార్డు, పాన్​కార్డు, లీగల్​హెయిర్ సర్టిఫికెట్స్​తయారు చేసినట్లు గుర్తించారు.  ఇలా తయారు చేసిన డాక్యుమెంట్స్​తో పద్మజా రెడ్డి తన చెల్లెలు నాగిరెడ్డి కోమల కుమారి పేర్ల మీద ప్లాట్​రిజిస్ట్రేషన్​చేసింది. 

దీంతో ఆరుగురిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. అశోక్​పరారీలో ఉన్నాడు. ఈ ముఠాపై హయత్​నగర్​, మీర్​పేట్,​ మేడిపల్లి ,సుల్తాన్​బజార్, మైలార్​దేవ్​పల్లిలో ఆరు కేసులు నమోదయ్యాయని పోలీసులు చెప్పారు. 8 ఫేక్​డాక్యుమెంట్లను సీజ్​చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా హయత్​నగర్​లో 274 గజాలు, జూబ్లిహిల్స్​లో 1000 గజాలు, వైజాగ్​లో ఒక స్థలాన్ని కబ్జా చేయడానికి ఫేక్​డ్యాకుమెంట్​తో సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.