ఏటీఎఫ్​ ధర 6.5శాతం తగ్గింపు

ఏటీఎఫ్​ ధర 6.5శాతం తగ్గింపు
  • వాణిజ్య ఎల్పీజీ రూ. 69 తగ్గింపు

న్యూఢిల్లీ: విమానాల్లో వాడే జెట్ ఇంధనం లేదా ఏటీఎఫ్​ ధర 6.5 శాతం తగ్గింది.  హోటళ్లు,  రెస్టారెంట్లు ఉపయోగించే వాణిజ్య ఎల్పీజీ  ధర రూ. 69 తగ్గింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం ప్రకటించింది.  

 ఏటీఎఫ్​ ధర కిలోలీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 6,673.87 తగ్గడంతో దేశ రాజధానిలో కిలోలీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 94,969.01కి పడిపోయింది.    ముంబైలో ఏటీఎఫ్ రేటు కిలోలీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.95,173.70 నుంచి రూ.88,834.27కి తగ్గింది.   స్థానిక పన్నులను బట్టి ధరలు ఒక్కో రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.