
బషీర్బాగ్, వెలుగు: ఓ వృద్ధుడి క్రెడిట్ కార్డు కొట్టేసి రూ.1.11లక్షలు వాడుకున్న జియో ఫైబర్టెక్నీషియన్ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి(78)కి ఇటీవల యాక్సిస్బ్యాంక్నుంచి మెసేజ్వచ్చింది. అందులో క్రెడిట్కార్డు డ్యూ అమౌంట్రూ. 1,11,589 అని ఉంది. వెంటనే యాక్సిస్ బ్యాంక్ కు వెళ్లి ఆరా తీయగా, పేటీఎం ద్వారా లావాదేవీలు జరిగినట్లు తెలుసుకున్నాడు.
తాను ఎలాంటి లావాదేవీలు జరపలేదంటూ బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ పి.ప్రమోద్ కుమార్ టీమ్దర్యాప్తు జరపగా వరంగల్ జిల్లాకు చెందిన ముదికే బాల్ రాజ్ ఈ లావాదేవీలు చేసినట్లు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా జియో ఫైబర్ టెక్నీషియన్ అని తెలిసింది. గతంలో వృద్ధుడి ఇంటికి వచ్చినప్పుడు క్రెడిట్ కార్డు వివరాలు, వ్యక్తిగత వివరాలు సేకరించి, కొత్త కార్డును అప్లై చేసినట్లు తెలిసింది. ఆ కార్డు ను ఉపయోగించి రూ.1,11,589 లను వాడుకున్నట్లు విచారణలో వెల్లడైంది.