
న్యూఢిల్లీ: ఓపెన్ టెలికాం ఏఐ ప్లాట్ఫారమ్ కోసం జియో ప్లాట్ఫారమ్స్, ఏఎండీ, సిస్కో, నోకియా జతకట్టాయి. ఇది నెట్వర్క్ భద్రతను, సామర్థ్యాన్ని పెంచుతుందని, టెక్నాలజీ ఖర్చులను తగ్గిస్తుందని భావిస్తున్నారు. మల్టీ-డొమైన్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్వర్క్ నెట్వర్క్ వల్ల కస్టమర్లకు ఎంతో మేలు జరుగుతుందని మంగళవారం ఇవి విడుదల చేసిన ప్రకటన తెలిపింది. ఏఎండీ, సిస్కో, నోకియాతో కలిసి, జియో ఓపెన్ టెలికాం ఏఐ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేస్తోంది.
దీనివల్ల మరింత సమర్థమైన నెట్వర్క్ను అందించవచ్చని రిలయన్స్ జియో గ్రూప్ సీఈఓ మాథ్యూ ఊమెన్ ప్రకటనలో తెలిపారు. నోకియా సీఈఓ పెక్కా లండ్మార్క్ మాట్లాడుతూ, ఆర్ఏఎన్, కోర్, ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్, ఐపీ ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్తో సహా పలు టెక్నాలజీల్లో తమకు మంచి పట్టు ఉందని అన్నారు. ఏఎండీ చైర్ సీఈఓ లిసా సు మాట్లాడుతూ, ఈ ప్లాట్ఫామ్ కోసం కంపెనీ ఎక్కువ సామర్థ్యం గల సీపీయూలను, జీపీయూలను, అడాప్టివ్ కంప్యూటింగ్ సొల్యూషన్ల పోర్ట్ఫోలియోను ఉపయోగించుకుంటుందని చెప్పారు.