జియో కొత్త రీచార్జ్ ప్లాన్ రూ. 122, రోజుకు 1GB డేటాతో..

జియో కొత్త రీచార్జ్ ప్లాన్ రూ. 122,  రోజుకు 1GB డేటాతో..

ప్రముఖ ప్రైవేట్ టెలికం సర్వీస్ ప్రొవైడర్ రిలయన్స్ జియో.. కొత్త రీచార్జ్ ప్లాన్ తీసుకొస్తుంది.. బడ్జెట్ కాన్షియస్ కస్టమర్లకోసం ఈ కొత్త ఆఫర్ ను అందిస్తుంది.ఈ రీచార్జ్ ప్లాన్ దాదాపు 149 కోట్ల సబ్ స్క్రైబర్లకు అందిస్తుంది. దేశంలో అత్యధికంగా వినియోగదారులలే లక్ష్యంగా జియో  లోబడ్జెట్ ప్లాన్లతో కస్టమర్లను ఆకట్టుకుం టోం ది. తక్కువ ఖర్చుతో కూడిన డేటా సొల్యూషన్‌లను కోరుకునే వారి కోసం టెలికాం కంపెనీ అద్భుతమైన ప్లాన్‌ను  తీసుకొస్తుంది.. దీని ధర కేవలం రూ. 122 మాత్రమే.

రూ. 122 ప్లాన్ వల్ల బెనిఫిట్స్.. 

రిలయన్స్ జియో నుంచి వచ్చిన ఈ కొత్ ప్లాన్ కస్టమర్లకు అత్యధికంగా రోజుకు 1GB డేటాను 28రోజుల పాటు అందిస్తుంది. ఈ ప్లాన్ జియో ఫోన్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. స్మార్ట్ ఫోన్ కస్టమర్లకు అందుబాటులో లేదు. ఈ ప్లాన్ ల వాయిస్ కాలింగ్ లేదా ఉచిత SMS లు కూడా ఉండవు. 

ALSO READ | కొత్త కస్టమర్లకు BSNL బంపరాఫర్.. అందుబాటులోకి అదిరిపోయే 2 కొత్త రీఛార్జ్ ప్లాన్స్

ఈ రీచార్జ్ ప్లాన్ ప్రత్యేకంగా జియో ఫోన్ కస్టమర్లకు కోసం రూపొందించడం జరిగింది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు అందుబాటులో లేదు. జియో ఫోన్ వినియోగదారులు తక్కువ ధరలో ప్లాన్ , డేటాకు ప్రాప్యతను కలిగి ఉండేలా ఈ ప్లాన్ ను యాడ్ ఆన్ గా పనిచేస్తుంది. 

ధర : రూ 122
డేటా : రోజుకు 1GB
చెల్లుబాటు : 28 రోజులు
అదనపువి : వాయిస్ కాలింగ్ లేదా SMS ప్రయోజనాలు లేవు

రిలయన్స్ జియో ప్రధానంగా తన వినియోగదారులకు సరసమైన ధరను కొనసాగిస్తూ మరింత విలువను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. జియో ఫోన్‌లపై ఆధారపడే వారికి, ఈ ప్లాన్ తక్కువ ఖర్చుతో విశ్వసనీయమైన డేటా కనెక్షన్‌ని నిర్ధారిస్తుంది.