ఎల్ఆర్ఎస్​ దరఖాస్తులను పరిష్కరించాలి : కలెక్టర్​ జితేశ్ వి.పాటిల్​

ఎల్ఆర్ఎస్​ దరఖాస్తులను పరిష్కరించాలి : కలెక్టర్​ జితేశ్ వి.పాటిల్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పెండింగ్​లో ఉన్న ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్​ జితేశ్ వి. పాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌‌‌‌లో  పలు శాఖల ఆఫీసర్లతో గురువారం నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. గ్రామీణ స్థాయిలో ఎల్ఆర్ఎస్​ క్రమబద్దీకరణ దరఖాస్తుల పరిశీలన స్పీడప్​ చేయాలన్నారు.  

రోజుకు కనీసం 10 దరఖాస్తులు పరిష్కరించేలా ప్లాన్​ చేసుకోవాలన్నారు.  దరఖాస్తుల పరిశీలన టైంలో క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాతనే ఫైనల్​ చేయాలన్నారు. ప్రతి దరఖాస్తులో ఎలాంటి లోటు పాట్లు లేకుండా పరిష్కరించే విధంగా ఆఫీసర్లు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, డీపీఓ చంద్రమౌళి, తహసీల్దార్లు, మున్సిపల్​ కమిషనర్లు పాల్గొన్నారు.