కుల్గామ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు ఉగ్రవాదులు..ఇద్దరు జవాన్లు మృతి

కుల్గామ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు ఉగ్రవాదులు..ఇద్దరు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లాలో జరిగిన రెండు ఎన్ కౌంటర్లలో  ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు ఆర్మీ జవానులు.  కుల్గామ్ జిల్లా ప్రిసల్ చిన్నగామ్ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో సైనికులు గాలింపు చర్యలు చేపట్టారు.  ఈ క్రమంలో భద్రతా దళాలపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు జరపడంతో నలుగురు టెర్రరిస్టులు చనిపోయారన్నారు ఆర్మీ అధికారులు. 

ఇంకా ఆ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయని ప్రకటించారు. ఇక కుల్గాం జిల్లాలోనే మరో ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో  ఇద్దరు జవాన్లు మృతి చెందారన్నారు.