
- జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహా రెడ్డి
జేఎన్టీటీయూ, వెలుగు : మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ల నుంచి సరికొత్త ఇన్నోవేషన్స్ రావాలని జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహా రెడ్డి అన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్’ అనే అంశంపై జేఎన్టీయూలోని జీబీకేరావు సెమినార్ హాల్లో మంగళవారం ఒక రోజు జాతీయ సదస్సు జరిగింది. వీసీ కట్టా నర్సింహా రెడ్డి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సెమినార్లో 30కి పైగా పేపర్ప్రజెంటేషన్లు, వివిధ అంశాల మీద చర్చలు నిర్వహించారు. పలువురు ఎక్స్పర్ట్స్ మెకానికల్ రంగంలో రావాల్సిన కొత్త మార్పులపై వారి అభిప్రాయాలను తెలిపారు. మెకానికల్ రంగంలో కొత్త ఆవిష్కరణలు జరగాలన్నారు.
రిజిస్ట్రార్ పదవీ విరమణ
జేఎన్టీయూ రిజిస్ట్రార్ డా. మంజూర్ హుస్సేన్ మంగళవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంజూర్ హుస్సేన్ వర్సిటీకి చేసిన సేవలను వీసీ, ప్రొఫెసర్లు గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో రెక్టార్ గోవర్ధన్, ఇంజనీరింగ్కాలేజీ ప్రిన్సిపల్ విజయకుమార్రెడ్డి, వైస్ ప్రిన్సిపల్జీవీ నర్సింహా రెడ్డి, మెకానికల్ డిపార్ట్మెంట్ హెడ్ డా. రాంజీ, ఇతర ప్రొఫెసర్లు పాల్గొన్నారు.