- హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు 1952, ఫిబ్రవరిలో ముగిశాయి. 25 మంది సభ్యులు పార్లమెంట్కు ఎన్నికయ్యారు.
- 1952 ఫిబ్రవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ శాసనసభకు 175 మంది ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ 93 స్థానాలు గెలుచుకుంది. ఇందులో తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైన వారి సంఖ్య 46.
- అప్పటి రాష్ట్ర రాజకీయాల్లో గోసాయి – దేశాయి వర్గాలుగా పేరుపడ్డ కాంగ్రెస్ వర్గాలు రామానందతీర్థ, బూర్గుల రామకృష్ణారావు వర్గాలు.
- 1952 సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టులు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతో పోటీ చేశారు.
- పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతో పోటీ చేసిన కమ్యూనిస్టులు హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో 42 స్థానాలు గెలుచుకున్నారు. ఇందులో తెలంగాణ నుంచి ఎన్నికైన వారి సంఖ్య 35. సోషలిస్టు పార్టీ 12 స్థానాలు గెలుచుకుంది.
- 1952 ఎన్నికల్లో ఓటమి పాలైన నిష్కల్మశప్రజా నాయకులు జమలాపురం కేశవరావు, మాడపాటి హనుమంతరావు, కాళోజీ నారాయణరావు.
- హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తర్వాత ఏర్పడిన ప్రజా ప్రభుత్వానికి నాయకునిగా బూర్గుల రామకృష్ణారావు ఎన్నికయ్యారు.
- బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రానికి 1952 మార్చి 6 నుంచి 1956 అక్టోబర్ 31 వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
- బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హైదరాబాద్ రాష్ట్ర గవర్నర్ సీఎం త్రివేది. స్పీకర్ కాశీనాథరావు వైద్య, డిప్యూటీ స్పీకర్ పంపన్గౌడ్.
- హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వి.డి.దేశ్పాండే.
- బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో హోంశాఖ మంత్రి దిగంబరరావు బిందు, ఎక్సైజ్, అటవీ, రెవెన్యూ శాఖల మంత్రి కె.వి.రంగారెడ్డి, ఆర్థిక మంత్రి వినాయకరావు విద్యాలంకార్, వ్యవసాయం, పౌర సరఫరాలు, ప్రణాళికా, అభివృద్ధి శాఖ మంత్రి మర్రి చెన్నారెడ్డి, విద్యాశాఖ మంత్రి గోపాలరావు ఎక్బొటే, సమాచార శాఖ మంత్రి దేవీసింగ్ చౌహన్.
- బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజ్ప్రముఖ్గా వ్యవహరించారు.
-
- బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఉన్న ఐసీఎస్ అధికారి ఎం.కె.వెల్లోడి.
- హైదరాబాద్ రాష్ట్రంలో రక్షిత కౌలుదార్ల చట్టం 1950 జనవరి నుంచి అమల్లో ఉంది.
- భారతదేశంలో భూకమతాలపై గరిష్ట పరిమితిని విధించిన ప్రథమ ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు పేరుపొందారు.
- బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నిజాం కరెన్సీ, నాణేలు రద్దయి, వాటి స్థానంలో భారత ప్రామాణిక కరెన్సీ అమల్లోకి తీసుకువచ్చింది.
- మాతృభాషలో విద్యాబోధనను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం హైదరాబాద్.
- మాతృభాషలో విద్యాబోధనను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు.
- ప్రతి 500 జనాభా గల గ్రామానికి పాఠశాలను ఏర్పాటు చేసింది బూర్గుల రామకృష్ణారావు.
- బూర్గుల రామకృష్ణారావు పాలనా కాలంలో మొదటి తరగతి నుంచి మాతృభాషలో విద్యా బోధన ప్రవేశపెట్టారు.
- బూర్గుల రామకృష్ణారావు పాలనా కాలంలో ఐదో తరగతి నుంచి ఇంగ్లీష్ భాషను ప్రవేశపెట్టారు.
- వరంగల్ జిల్లా నుంచి కొన్ని ప్రాంతాలను వేరు చేసి 1953 అక్టోబర్ 1న ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేశారు.
- హైదరాబాద్ రాష్ట్రంలో అవినీతి నిరోధకశాఖను 1955 జులై 1న ఏర్పాటు చేశారు.
- నాగార్జున సాగర్ బహుళార్ధసాధక ప్రాజెక్టుకు 1955 డిసెంబర్ 10న ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు శంకుస్థాపన చేశారు.
- తెలంగాణలో భూదానోద్యమం 1951 ఏప్రిల్ 18న నల్లగొండ జిల్లాలోని పోచంపల్లి నుంచి ప్రారంభమైంది.
- భూదానోద్యమానికి మొట్టమొదటి భూమి దానం చేసిన భూమి పోచంపల్లికి చెందిన దేశ్ముఖ్ వెదిరె రామచంద్రారెడ్డి.
-
- ముల్కీఉద్యమం ఆంధ్రా గోబ్యాక్ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ నినాదాలతో ప్రారంభమైంది.
- విద్యార్థులు ఐక్యకార్యాచరణ కమిటీగా ఏర్పడి 1952 జులై 26న వరంగల్ వేలాది మందితో బ్రహ్మాండమైన ప్రదర్శన నిర్వహించారు.
-
- ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో వరంగల్లో విద్యార్థి ఐక్యకార్యాచరణ కమిటీ మరోసారి బ్రహ్మాండమైన ప్రదర్శన జరిపిన తేదీ 1952 ఆగస్టు 27.
- హన్మకొండలో విద్యార్థులపై పోలీసులు 1952 ఆగస్టు 30వ తేదీన లాఠీఛార్జీ జరిపారు.
- హన్మకొండలో విద్యార్థులపై లాఠీఛార్జీకి నిరసనగా హైదరాబాద్లో 1952 ఆగస్టు 31న సమ్మె నిర్వహించారు.
- హైదరాబాద్లో విద్యార్థులు నాన్ ముల్కీ గో బ్యాక్ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ స్టూడెంట్ యూనియన్ జిందాబాద్ నినాదాలతో 1952 సెప్టెంబర్ 2న భారీ ర్యాలీ నిర్వహించారు.
- 1952 సెప్టెంబర్ 3, 4వ తేదీల్లో విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతిచెందారు.
- విద్యార్థులపై జరిపిన కాల్పులపై విచారణకు 1952 సెప్టెంబర్ 5న ప్రభుత్వం జస్టిస్ పింగళి జగన్మోహన్రెడ్డి కమిటీ వేసింది.
- ముల్కీ నిబంధనల రూపకల్పనపై బూర్గుల ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని 1952 సెప్టెంబర్ 7న ఏర్పాటు చేసింది.
- ముల్కీ నిబంధనల అమలుపై బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంలోని సభ్యులు కొండా వెంకటరంగారెడ్డి, జి.ఎస్. మేల్కోటే, పూల్చంద్ ప్రేమ్చంద్ గాంధీ, మెహదీ నవాజ్ జంగ్.
- ముల్కీ ఉద్యమంలో పాల్గొని ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టం కింద 1952 సెప్టెంబ్ 13న ఎమ్మెల్యే సయ్యద్ అక్తర్ హుస్సేన్ అరెస్టయ్యారు.