చుంచుపల్లి మండలంలో ఆగష్టు 29న జాబ్​ మేళా : ఆఫీసర్​ శ్రీరామ్

చుంచుపల్లి మండలంలో ఆగష్టు 29న జాబ్​ మేళా : ఆఫీసర్​ శ్రీరామ్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : చుంచుపల్లి మండల పరిషత్​ ఆఫీస్​లో ఈ నెల 29న నిరుద్యోగులకు జాబ్​ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఎంప్లాయిమెంట్​ ఆఫీసర్​ శ్రీరామ్​ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పారమౌంట్​ బిల్డింగ్​ సొల్యూషన్స్​, భారత్​ మోటో కార్పోరేషన్​ సంస్థల్లో పనిచేసేందుకు వంద మంది అవసరం ఉందన్నారు. 

వెల్డర్​, ఫిట్టర్​, సూపర్​ వైజర్​ ట్రైనీ ఇంజనీర్స్​, ఫీల్డ్​ సేల్స్​ కన్సల్టెంట్స్​ పోస్టులకు ఐటీఐ, డిప్లమా మెకానికల్​, బీటెక్​ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.    యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలుంటాయని తెలిపారు.