జూన్ 19న ఇంచర్లలో జాబ్​ మేళా : మంత్రి సీతక్క

జూన్ 19న ఇంచర్లలో జాబ్​ మేళా : మంత్రి సీతక్క

ములుగు, వెలుగు : ములుగు మండలం ఇంచర్ల గ్రామంలో ఈనెల 19న నిరుద్యోగ యువత కోసం జాబ్​ మేళా నిర్వహిస్తున్నట్టు మంత్రి సీతక్క శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్​ మేళాలో 58 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు. విప్రో, ముథూట్ గ్రూప్స్​, అపోలో ఫార్మసీ, వరుణ్​ మోటార్స్, యాక్సిస్​ బ్యాంక్​, సాఫ్టెక్​ సొల్యూషన్​, మెడ్​ ప్లస్​, సెవెన్ టెక్​ ఐటీ సొల్యూషన్​, శ్రీ చైతన్య విద్యాసంస్థలు తదితర 58 కంపెనీలు మెగా జాబ్​ మేళాలో పాల్గొంటాయని పేర్కొన్నారు. ఇంచర్ల జీఎంఆర్​ గార్డెన్స్లో   ఉదయం 9గంటలకు మేళా ప్రారంభం అవుతుందని చెప్పారు.