నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్‌లో జాబ్ మేళా

నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్‌లో జాబ్ మేళా

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త అందుతోంది. ఆగస్టు 20న నాంపల్లిలోని రెడ్‌రోజ్‌ ప్యాలెస్‌ ఫంక్షన్‌ హాల్‌లో మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో ఫార్మా, హెల్త్, ఐటీ, ఐటీ, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్ తదితర విభాగాల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. 

ఈ జాబ్ మేళాలో ఫార్మా, హెల్త్, ఐటీ ఇండస్ట్రీకి చెందిన పెద్ద పెద్ద కంపెనీలు పాల్గొననున్నట్లు నిర్వహకులు తెలిపారు. కావున ఉద్యోగాన్వేషణలో ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. పాల్గొనాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతిలో ఉతీర్ణులై ఉండాలి. మరిన్ని వివరాల కోసం, ఆసక్తి గల అభ్యర్థులు 8374315052 నంబర్‌లో సంప్రదించవచ్చు.