
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కేంద్రీయ విద్యాలయాల్లో ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థుల కోసం న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగఠన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది.13,404 బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.
ప్రైమరీ టీచర్ పోస్టులు: మొత్తం ప్రైమరీ టీచర్ ఖాళీలు 6414 ఉన్నాయి. (యూఆర్- 2599, ఓబీసీ- 1731, ఎస్సీ- 962, ఎస్టీ- 481, ఈడబ్ల్యూఎస్- 641)
అర్హత: సీనియర్ సెకండరీ, డీఈఎల్ఈడీ, డీఈఎల్ఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్). లేదా సీనియర్ సెకండరీ, బీఈఎల్ఈడీ లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణతతో పాటు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్) పేపర్-1లో అర్హత సాధించి ఉండాలి. 30 సంవత్సరాలకు మించకూడదు.
సెలెక్షన్: రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. కేవీఎస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో డిసెంబర్ 26 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
పీజీటీ, టీజీటీ పోస్టులు: ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, ఏఎస్వో తదితర మొత్తం 6,990 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) పేపర్-2 అర్హత సాధించి ఉండాలి.రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
దరఖాస్తులు: ఆన్లైన్లో డిసెంబర్ 26 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాల కోసం www.static.langimg.com వెబ్సైట్లో సంప్రదించాలి.