
- తిరగాల్సిన బస్సులను తుక్కు చేయించారు
- తొలగించిన కార్మికుల ఆరోపణ
ఖైరతాబాద్, వెలుగు: టీజీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అవినీతికి పాల్పడుతున్నారని సంస్థ మాజీ ఉద్యోగులు ఆరోపించారు. ఆయన తీరుతో ఆర్టీసీ సంస్థ మనుగడ ప్రశ్నార్థకమవుతోందని, తీరని నష్టం జరుగుతోందని చెప్పారు. 2 లక్షల కిలో మీటర్లు తిరగాల్సిన బస్సులను తుక్కు చేయించారన్నారు. తమ సమస్యలను చెప్పుకునేందుకు కనీసం అనుమతించడం లేదని వాపోయారు.
కార్మికుల సమస్యలను వినని వ్యక్తి ఎండీగా ఎందుకని ప్రశ్నించారు. సజ్జనార్ను ఆర్టీసీ నుంచి బదిలీ చేసి, న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్చేశారు. ఇప్పటికే ప్రధాని మోదీ, రాష్ట్ర గవర్నర్జిష్ణు దేవ్వర్మ, లోకా యుక్తాకు ఫిర్యాదు చేశామని ఆర్టీసీ సెక్యూరిటీ వింగ్లో పనిచేసిన మాజీ ఉద్యోగి దుగ్గు రాజేందర్ తెలిపారు.
డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లుగా పనిచేస్తున్న దాదాపు 600 మందిని బీఆర్ఎస్హయాంలో చిన్న చిన్న కారణాలతో తొలగించారని వాపోయారు. కాంగ్రెస్ప్రభుత్వం వారిలోని 200 మందికి తిరిగి ఉద్యోగాలు ఇచ్చిందని, మిగతా వారికి కూడా ఇవ్వాలని కోరుతూ మంగళవారం 50 మంది మాజీ ఉద్యోగులు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు.
చిన్న చిన్న తప్పులకు తమను సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తున్నారని మాజీ కండక్టర్లు రాజు, అంబిక, రజిత, శోభారాణి, డ్రైవర్లు ప్రవీణ్, మొగలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం లేక పిల్లలకు తిండి పెట్టలేని స్థితిలో ఉన్నామని, సీఎం పరిశీలించి విధుల్లోకి తీసుకోవాలని కోరారు.