
- ఆంధ్ర ప్రాంతం ఉద్యోగులను తెలంగాణ నుంచి బదిలీ చేయనున్నట్లు ప్రభుత్వం జోఓ నెంబర్ 36 ద్వారా స్పష్టం చేసింది.
- ప్రభుత్వ జీవో 36కు వ్యతిరేకంగా ఆంధ్ర ఉద్యోగులు సుప్రీంకోర్టు 1969 ఫిబ్రవరి 4న రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
- ఆంధ్ర ఉద్యోగులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన రాజ్యాంగ ధర్మాసనం జీవో 36ను కొట్టివేసింది. రాజ్యాంగంలో 16(3) ఆర్టికల్కు జీవో 36 వ్యతిరేకమని ధర్మాసనం భావించింది.
- ఏపీ ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావు 1971 సెప్టెంబర్ 25న బాధ్యతలు చేపట్టారు.
- ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ముల్కీ నిబంధనలు చెల్లవని 5 న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు పూర్తి బెంచ్ 4–1 మెజార్టీతో తీర్పును 1972 ఫిబ్రవరి 14న వెలువరించింది.
- ముల్కీ నిబంధనలపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడానికి పి.వి.నరసింహారావు చొరవ చూపారు.
- చారిత్రక పరిస్థితుల రీత్యా తెలంగాణలో అమలులో ఉన్న ముల్కీ నిబంధనలు చట్టబద్ధమేనని సుప్రీంకోర్టు 1972 అక్టోబర్ 3న తీర్పు వెలువరించింది.
- 1972 అక్టోబర్ లో ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు వెలువరించిన అంగీకరించని ఆంధ్ర ప్రాంత నాయకులు జై ఆంధ్ర ఉద్యమాన్ని చేపట్టారు.
- కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు 1972 డిసెంబర్ 31న తిరుపతిలో సమావేశమై రాష్ట్ర మంత్రివర్గం నుంచి మంత్రులు రాజీనామా చేయాలని, ప్రజలు పన్నులు కట్టరాదని, రాష్ట్ర ప్రభుత్వ పాలనను స్తంభింపజేయాలని తీర్మానం చేశారు.
- తెలంగాణ– ఆంధ్ర ప్రాంతాల ప్రజల్లో నెలకొన్న భావోద్వేగాలను గమనించి, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1972 నవంబర్ 27న పంచసూత్ర ప్రణాళికను ప్రకటించారు.
- ముల్కీ నిబంధనలు హైదరాబాద్ సికింద్రాబాద్లోని ఉద్యోగాలకు 1977 వరకు తెలంగాణలో మిగిలిన ప్రాంతాలకు 1980 వరకు వర్తిస్తాయని ప్రధాని ఇందిరాగాంధీ వెల్లడించారు.
- ప్రధాని ప్రకటనకు నిరసనగా న్యాయవాదులు రాజమండ్రిలో సభ నిర్వహించి 1975 డిసెంబర్ 5న ఆంధ్ర బంద్ నిర్వహించారు.
- పంచసూత్ర పథకాన్ని తిరస్కరించిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులు 1972 డిసెంబర్ 7 నుంచి సమ్మె ప్రారంభించారు.
- జై ఆంధ్ర ఉద్యమాన్ని జనసంఘ్, స్వతంత్ర పార్టీ సమర్థించాయి. సీపీఐ, సీపీఎం పార్టీలు వ్యతిరేకించాయి.
- సమైక్యవాదులు 1972 డిసెంబర్ 24న విజయవాడ నగరంలో చేపట్టిన ఊరేగింపులో హింస చెలరేగింది. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలను కోల్పోయారు.
- 1972 డిసెంబర్లో ముల్కీ అనే పదాన్ని నిర్వచించని ఆంధ్ర ప్రాంత నాన్ గెజిటెడ్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు.
- తెలంగాణలో పుట్టి పెరిగినవారు ముల్కీలు కాదని, తెలంగాణ వలస వచ్చి స్థిరపడ్డవారే ముల్కీలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1973 ఫిబ్రవరి 17న తీర్పు వెలువరించింది.
- ముల్కీ నియమనిబంధనలు ఉద్యోగాల నియామకపు ప్రక్రియలో వర్తిస్తాయే గానీ ఆ తర్వాత సీనియారిటీ, ప్రమోషన్, వెనుకటి ఉద్యోగానికి తిరిగి పంపడం, ఉద్యోగం నుంచి తీసివేయడం మొదలైన వాటికి వర్తించవని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1973 జులై 11 తీర్పునిచ్చింది.
- ఆంధ్రప్రదేశ్లో 1973 జనవరి 18న రాష్ట్రపతి పాలన విధించారు.
- 1972లో తెలంగాణ ప్రాంతీయ కమిటీ చైర్మన్ కోదాటి రాజమల్లు
- ఆంధ్ర ప్రాంత నాన్గెజిటెడ్ ఉద్యోగులు108 రోజులు సమ్మె చేశారు.
- 108 రోజులపాటు సమ్మె చేపట్టిన ఆంధ్ర ప్రాంత నాన్ గెజిటెడ్ ఉద్యోగులు 1973 మార్చి 25న సమ్మెను విరమించారు.
- జై ఆంధ్ర ఉద్యమం తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణం కాకాని వెంకటరత్నం మృతి.
- ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం డిమాండ్ చేసే నాయకులను ప్రధాని ఇందిరాగాంధీ 1973 ఫిబ్రవరి 7న ఢిల్లీకి ఆహ్వానించారు.
- ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలనను 1973 సెప్టెంబర్ 1న పునరుద్ధరించారు.
- 10 నెలలు జరిగిన జై ఆంధ్ర ఉద్యమం 1973 అక్టోబర్లో నిలిచిపోయింది.