
- 1579లో థామస్ స్టీవెన్స్ అనే బ్రిటిష్ జాతీయుడు భారత్కు వచ్చి సాల్సెట్టిలో క్రైస్తవ మత ప్రచారకుడిగా పనిచేశాడు. ఈయన తన తండ్రికి రాసిన అనేక ఉత్తరాల్లో భారతదేశ స్థితిగతులను వివరిస్తూ ఆసక్తికరంగా తెలిపాడు.
- 1587లో రాల్ష్ పిచ్, జేమ్స్ న్యూబెర్రీ, విలియం లీడ్స్ అనే ముగ్గురు బ్రిటిష్ వ్యాపారులు భూమార్గంగా భారత్ను సందర్శించారు. వారు తమ రచనల్లో భారతదేశంలో చూసిన విషయాలను వివరించారు.
- 1587లో ఒక పెద్ద పోర్చుగీసు నౌకను బ్రిటిష్ నౌకాదళాధికారైన ఫ్రాన్సిస్ డ్రేక్ పట్టుకున్నారు. భారత్ నుంచి వస్తున్న ఆ నౌకలోని వస్తువుల విలువ లక్ష పౌండ్లు.
- 1599లో డచ్వారు ఇంగ్లండ్ మార్కెట్లలో మిరియాల ధరను మూడింతలు పెంచారు. నల్లబంగారంగా ఇంగ్లండ్లో పేరొందిన మిరియాలను తక్కువ ధరకు పొందడం కోసం భారత్తో సరాసరి వర్తక సంబంధాలను స్థాపనకు బ్రిటిష్ వారు నిర్ణయించారు.
- 1600 డిసెంబర్ 31న అప్పటి బ్రిటిష్ రాణి ఎలిజబెత్ అనుమతితో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీని స్థాపించారు. ఇది పూర్తిగా ప్రైవేట్ సంస్థ. కంపెనీ పరిపాలనను గమనించడం కోసం గవర్నర్ ఉండేవాడు.
- 1600 నుంచి 1612 వరకు ప్రత్యేక నౌకాయానాలు కొనసాగాయి. ఒక్కో నౌకాయానం ముగిసిన తర్వాత లాభాలను వాటాదారులు పంచుకునేవారు.
- మొదట్లో బ్రిటిష్ వారు భారతదేశంపై ఎక్కువ శ్రద్ధ చూపలేదు. మలయా ద్వీపకల్పంపై ఆసక్తి కనబర్చారు. కానీ 1623లో అంబోయానా మారణకాండ తర్వాత బ్రిటిష్ వారు ఆ ప్రాంతంలో కొనసాగడానికి భయపడి భారత్పై దృష్టిని మళ్లించారు.
- ఈస్ట్ ఇండియా కంపెనీ 1612లో ఢిల్లీ చక్రవర్తి జహంగీర్ వద్దకు బ్రిటిష్ నౌకాదళాధికారైన హాకిన్స్ను పంపించింది. కానీ ఈ రాయబారం విఫలమైంది. అప్పటికే ఢిల్లీలోని మొగల్ దర్బార్లో పోర్చుగీసు వారు పలుకుబడి కలిగి ఉండటం ఇందుకు కారణం.
- ఇంగ్లండ్ రాజు ఒకటో జేమ్స్ తరఫున సర్ థామస్ రో 1615లో ఢిల్లీ చక్రవర్తిని కలిశాడు. అప్పటికి పోర్చుగీసు వారి ప్రాబల్యం తగ్గడంతో థామస్ రో కోరిక మేరకు సూరత్ రేవును బ్రిటిష్ వారికిచ్చి పన్నులు లేకుండా వ్యాపారం చేసుకోవడానికి అనుమతిచ్చాడు.
- భారత్లో బ్రిటిష్ వారు పొందిన మొదటి వర్తక స్థావరం సూరత్. 1622లో సూరత్లోని బ్రిటిష్ వారు పోర్చుగీసు వారి ఆధీనంలోని ఆర్మజ్ను ఆక్రమించారు.
- గోల్కొండ నవాబు అనుమతితో బ్రిటిష్ వారు తూర్పుకోస్తాలో మచిలీపట్నం వద్ద 1613లో ఒక వర్తక స్థావరం స్థాపించారు. ప్రారంభంలో ఇబ్బందులు ఎదురైనా 18వ శతాబ్దంలో మచిలీపట్నం బ్రిటిష్ వారి ప్రధాన రేవుగా తయారైంది.
- మచిలీపట్నం కౌన్సిల్ సభ్యుడు ఫ్రాన్సిస్ డే.. ప్రస్తుత మద్రాస్ నగరం గల ప్రాంతాన్ని ఎంపిక చేసి చంద్రగిరి రాజు నుంచి 1639లో కొనుగోలు చేశారు. ఇక్కడ నిర్మించిన కోట సెయింట్ జార్జి.
- 1652లో మద్రాస్ను రాష్ట్రస్థాయికి అభివృద్ధి చేశారు. ఇక్కడి బ్రిటిష్ స్థావరం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయికి పెంచిన తర్వాత మద్రాస్ వేగంగా అభివృద్ధి చెందింది.
- తూర్పు ప్రాంతంలో బ్రిటిష్ వారికి 1633 నుంచి బాలసోర్, హరిహరపూర్ అనే రెండు చిన్న వ్యాపార కేంద్రాలు ఉండేవి. 1651లో హుగ్లీలో మరో స్థావరం ప్రారంభించారు.
- బ్రిటిష్ వైద్యుడు గాబ్రియల్ బౌటన్కు మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ బహుమానంగా హుగ్లీ నదీ తీరంలో కొంత భూమిని ఇచ్చారు. ఈ భూమిని ఈస్ట్ ఇండియా కంపెనీ కొనుగోలు చేసి కలకత్తా నగరాన్ని నిర్మించింది.
- 1687లో కలకత్తా నగర నిర్మాణ పథకాలను ఔబ్ ఛార్నక్ పూర్తి చేశాడు. ఇక్కడ పోర్ట్ విలయం అనే కోటను నిర్మించారు.
- పోర్ట్ విలియం కోటకు చేరువలోని సుతానుతి, గోవిందపూర్, కలికట అనే మూడు గ్రామాలనూ ఈస్ట్ ఇండియా కంపెనీ కొనుగోలు చేసి కలకత్తా నగరంగా అభివృద్ధి చేసింది.
- కలికట గ్రామం వల్ల ఆ నగరానికి కలకత్తా అని పేరు వచ్చింది. కలకత్తాతోపాటు ఫల్టా, ఖాసీంబజార్ కూడా బ్రిటిష్ వారి ప్రసిద్ధ తొలి వ్యాపార కేంద్రాలు.
- సూరత్ రేవులో బ్రిటిష్ వారు మహారాష్ట్రుల దండయాత్రలకు గురవుతూ వచ్చారు. అక్కడి నుంచి సురక్షిత స్థావరానికి వెళ్లాలనే ఆలోచన కలిగింది. ప్రస్తుత బొంబాయి దీవిని 1667లో ఇంగ్లండ్ రాజైన రెండో చార్లెస్ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ కౌలుకు తీసుకుంది.