మున్సిపల్​ చైర్మన్, వైస్​ చైర్మన్​ కాంగ్రెస్​లో చేరిక

మున్సిపల్​ చైర్మన్, వైస్​ చైర్మన్​ కాంగ్రెస్​లో చేరిక

జోగిపేట,వెలుగు : జోగిపేట మున్సిపాల్టీ చైర్మన్ మల్లయ్య, వైస్​ చైర్మన్​ ప్రవీణ్​, కౌన్సిలర్​ సుమిత్ర, చేనేతసహకార  సంఘం మాజీ చైర్మన్​ సత్యం, మార్క్​ఫెడ్​ డైరెక్టర్​జగన్మోహన్​రెడ్డి శనివారం  మంత్రి దామోదర  రాజనర్సింహ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ..అందరూ కలిసి పార్లమెంట్​ఎన్నికల్లో కాంగ్రెస్​అభ్యర్థి సురేశ్​శెట్కార్​ను గెలిపించాలన  సూచించారు. 

కాంగ్రెస్​లో చేరిన జడ్పీటీసీ, మాజీ డీసీఎంఎస్​ చైర్మన్​

రాయికోడ్:  జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్​పాటిల్​, మాజీ  డీసీఎంఎస్​ చైర్మన్​ సిద్దన్నపాటిల్​, మండల​బీఆర్ఎస్​అధ్యక్షుడు బస్వరాజ్​పాటిల్, మాజీ సర్పంచులు  సంగమేశ్వర్​పాటిల్, శంకర్​ముదిరాజ్, యాదయ్య, వినయ్​ కుమార్, సంతోష్​ కుమార్ పాటిల్​తో పాటు నాయకులు, కార్యకర్తలు  బీఆర్​ఎస్​కు  గుడ్​బై చెప్పి  కాంగ్రెస్​లో జాయిన్​అయ్యారు. శనివారం  మంత్రి దామోదర రాజనర్సింహ  వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.