
జన్నారం,వెలుగు: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వారిలో దేవునిగూడ బీజేపీ ఇన్చార్జి సింగిరెడ్డి సుధాకర్ రెడ్డి, బీఆర్ఎస్ లీడర్ లోతొర్రె మాజీ సర్పంచ్ నర్సింగరావు, బంజార సంఘం మండల ప్రెసిడెంట్ అజ్మీర బీంలాల్ నాయక్ తో పాటు మరో 20 మంది కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ముజాఫర్ ఆలీఖాన్, పార్టీ సీనియర్ నాయకులు రాజశేఖర్,సయ్యద్ ఇసాక్ తదితరులున్నారు.