పోలీసుల త్యాగాలు మరువలేనివి : పోలీసు ఉన్నతాధికారులు

పోలీసుల త్యాగాలు మరువలేనివి : పోలీసు ఉన్నతాధికారులు

మహబూబాబాద్/ ములుగు/ హసన్​పర్తి/ తొర్రూరు/ ఖిలా వరంగల్, వెలుగు​: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని పోలీసు ఉన్నతాధికారులు అన్నారు. సోమవారం ఉమ్మడి వరంగల్​జిల్లా పోలీసుల అమరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్​అమరుల స్థూపానికి నివాళులర్పించారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు.

అనంతరం అమరవీరుల కుటుంబాలను సన్మానించి, బహుమతులు అందజేశారు. హనుమకొండ జిల్లా భీమారంలోని శుభం కల్యాణవేదికలో ఎంజీఎం రక్తనిధి సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వరంగల్​సీపీ అంబర్​కిషోర్​ప్రారంభించారు. రక్తదానం చేసిన హనుమకొండ, కాజీపేట, కేయూసీ పీఎస్​ల పరిధిలోని యువకులు, పోలీసులకు ఆయన సర్టిఫికెట్లు, పండ్లు, హెల్త్​డ్రింక్స్​అందజేశారు.

కార్యక్రమంలో సెంట్రల్​జోన్​డీసీపీ షేక్​సలీమా, ఏసీపీ దేవేందర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్​జిల్లా కేంద్రంలో ఎస్పీ సుధీర్​రామ్​నాథ్​కేకన్, కలెక్టర్​అద్వైత్​కుమార్​సింగ్​ఏఎస్పీ చెన్నయ్య, డీఎస్పీ తిరుపతిరావు పాల్గొన్నారు. ములుగు హెడ్​క్వార్టర్స్​లో ఎస్పీ పి.శబరీశ్​​ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించగా, అడిషనల్​ఎస్పీ సదానందం, డీఎస్పీలు రాములు, రవీందర్​తదితరులు పాల్గొన్నారు. తొర్రూరులో సీఐ జగదీశ్​ఆధ్వర్యంలో పట్టణంలో పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వరంగల్​సిటీ మామునూర్​పోలీసు శిక్షణ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పీటీసీ ప్రిన్సిపల్​పూజ పాల్గొని అమరవీరుల త్యాగాలను  వివరించారు.