పార్టీ పెట్టిన పాటల రచయిత... ఏపీలో మరో రాజకీయ పార్టీ

పార్టీ పెట్టిన పాటల రచయిత... ఏపీలో మరో రాజకీయ పార్టీ

ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుంది. తెలుగు భాషా పరిరక్షణ కోసం ‘జై తెలుగు’ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రకటించారు. రాజకీయ నాయకులకు, ప్రజలకు సరైన అవగాహన కల్పించడమే తన లక్ష్యమని తెలిపారు.  తెలుగు భాషా సంస్కృతి కోసం ప్రత్యేక రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తున్నానని… రాజకీయ నాయకులకు, ప్రజలను చైతన్య వంతులుగా చేయడానికే ఈ రాజకీయ వేదిక అని విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రకటించారు.  తెలుగు భాష, పరిరక్షణ అజెండాతో రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. ఆగస్ట్ 15 నాటికి తమ పార్టీ విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ బాగా నష్టపోయిందని… భాషా, సంస్కృతి పూర్తిగా వీధిన పడిపోయిందని చెప్పారు. జై తెలుగు పేరుతో ఐదు రంగులతో పతాకాన్ని కూడా రూపొందించానని వివరించారు.    జై తెలుగు’ పేరుతో ఐదు రంగులతో పతాకాన్ని రూపొందించానని జొన్నవిత్తుల తెలిపారు. నీలం రంగు.. జలం, పచ్చ రంగు.. వ్యవసాయం, ఎరుపు రంగు.. శ్రమశక్తి, పసుపు.. వైభవానికి, తెలుపు.. స్వచ్ఛతకు చిహ్నంగా రూపొందించినట్లు చెప్పారు. తెలుగు భాష రథాన్ని ప్రజలు లాగాలనేది తన ఆకాంక్షగా జొన్నవిత్తుల చెప్పుకొచ్చారు.

కానీ తెలుగు వాళ్లం అని మాత్రం అనిపించులేక పోతున్నామని… మన భాషను మనమే విస్మరించి చులకన చేసుకున్నామని వెల్లడించారు. తెలంగాణ భాష మొత్తం ఒక్కటే.. ఏపీలొ మాత్రం ప్రాంతాల వారీగా భాష మారిపోతుంది… మన భాష కు పునర్వైభవాన్ని తీసుకురావాలనేదే నా సంకల్పం అని చెప్పారు. లక్షల కోట్ల బడ్జెట్, అధికారం ఉన్న ప్రభుత్వాలు తెలుగు భాషకు సమున్నత స్థానం కల్పించాలని.. త్వరలో మా పార్టీ విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. తెలుగు భాషా పరిరక్షణ అజెండాతో వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తామని ప్రకటించారు. తెలుగు భాష కోసం ఐదుగురు ‌మహనీయులు కృషి చేశారని.. త్యాగాలు చేశారని వెల్లడించారు. గిడుగు రామ్మూర్తి నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ చిత్రాలు తన జై తెలుగు రాజకీయ జెండాలో, ఎజెండాలో ఉంటాయన్నారు. మన భాష సంస్కృతి వైభవం గురించి నేడు ఎవ్వరికీ తెలియని పరిస్థితి అని… నాడు మదరాసీలు అన్నారు.. నేడు హైదరాబాదీలు అనిపించుకుంటున్నామన్నారు. -