జర్నలిస్టులపై దాడులను అరికట్టాలి : జేఏసీ నాయకులు

జర్నలిస్టులపై దాడులను అరికట్టాలి : జేఏసీ నాయకులు

ఆదిలాబాద్, వెలుగు: రాజకీయ పార్టీలు, నాయకులకు వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంగా వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై కొందరు నాయకులు బెదిరింపులు, భౌతిక దాడులు చేస్తున్నారని, ఇలాంటి చర్యలను అరికట్టాలని జర్నలిస్ట్ జేఏసీ నాయకులు ఎస్పీ గౌస్ ఆలంను కోరారు. ఈ మేరకు బుధవారం ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు.

ఇప్పటికే ఆదిలా బాద్ జిల్లాలోని పలువురు జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తామని  బెదిరిస్తున్నారని, తాజాగా టీవీ ఛానెల్ రిపోర్టర్ పై కాంగ్రెస్ నియోజక వర్గ ఇన్​చార్జి బెదిరింపులకు పాల్పడ్డారని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటివారిపై చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్ట్ జేఏసీ కన్వీనర్ నూకల దేవేందర్, కో కన్వీనర్ బీర్కూర్వార్ వెంకటేశ్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు, ఫొటోగ్రాఫర్స్, కెమెరామెన్స్ తదితరులు పాల్గొన్నారు.