
హనుమకొండ, వెలుగు : వార్తల కవరేజీలో ఉన్న జర్నలిస్టులను తిట్టిన వరంగల్ సెంట్రల్జోన్ డీసీపీ ఎంఏ.బారిపై చర్యలు తీసుకోవాలంటూ వరంగల్ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. ఆదివారం వరంగల్లో మంత్రుల పర్యటన సందర్భంగా ఎస్ఎన్ఎం క్లబ్లో జరిగిన కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు జర్నలిస్టులు వెళ్లారు. వీడియోలు తీసుకునేందుకు వెళ్లగా డీసీపీ బారి వచ్చి వారిని బూతులు తిడుతూ నెట్టేశారు. అనరాని మాటలన్నారు. దీనికి నిరసనగా సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని వరంగల్ ప్రెస్క్లబ్ నుంచి సీపీ ఆఫీస్ వరకు ర్యాలీ తీసి కమిషనర్ అంబర్ కిశోర్ ఝాకు వినతిపత్రంఇచ్చారు. డీసీపీపై చర్యలు తీసుకోవడంతో పాటు జర్నలిస్టులను దూషించినందుకు సారీ చెప్పించాలని డిమాండ్ చేశారు. సీపీ నుంచి సరైన స్పందన రాకపోవడంతో అక్కడి నుంచి నేరుగా ఇంతేజార్ గంజ్ పీఎస్లో డీసీపీ బారిపై ఫిర్యాదు చేశారు. డీసీపీపై చర్యలు తీసుకునేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.