
కామారెడ్డి, వెలుగు : జిల్లాలో జొన్నల కొనుగోలుకు 16 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మార్క్ ఫెడ్ కామారెడి జిల్లా మేనేజర్ మహేశ్కుమార్ తెలిపారు. క్వింటాల్కు మద్దతు ధర రూ. 3,371 చెల్లిస్తామన్నారు. మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, ఆర్గొండ, కారేగావ్, గాంధారి, పిట్లం, పుల్కల్, తిమ్మానగర్, గుంకుల్, బోర్లం, పెద్దకొడప్గల్, చిన్న కోడప్గల్, ముదోలి, ఎల్లారెడ్డి, పద్మాజివాడిల్లో సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.