జూనియర్ ఎన్టీఆర్ శనివారం (ఆగస్ట్ 31న) తన తల్లితో కలిసి ఉడుపి శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించారు. సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్, కాంతారా ఫేమ్ రిషబ్శెట్టి కూడా ఎన్టీఆర్ వెంట ఉన్నారు. ఈ నేపథ్యంలో మా అమ్మ కలను ఎట్టకేలకు నెరవేర్చాను అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
‘అమ్మ ఎప్పుడూ నన్ను తన సొంతూరు కుందాపురాతో పాటు, ఉడుపి శ్రీకృష్ణుడి దర్శనం చేయించాలని కల కంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ కల నిజమైంది. సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజు ముందు నేను ఆమెకు ఇచ్చే మంచి బహుమతి ఇదే. ఈ అరుదైన కలను సాధ్యం చేసినందుకు నిర్మాత విజయ్ కిరంగదూర్ సర్కు ధన్యవాదాలు. ఈ దర్శనానికి నా ప్రియమిత్రుడు ప్రశాంత్ నీల్తో కలిసి రావడం సంతోషంగా ఉంది. అలాగే రిషబ్శెట్టి కూడా వచ్చి ఈ క్షణాలను మరింత ప్రత్యేకంగా మార్చారు’’ అని ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఎన్టీఆర్ ఫొటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కుటుంబం.. ఉడుపి శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
My mother's forever dream of bringing me to her hometown Kundapura and seeking darshan at Udupi Sri Krishna Matha has finally come true! To make it happen just before her birthday on September 2nd is the best gift I could give her.
— Jr NTR (@tarak9999) August 31, 2024
Thanks to @VKiragandur sir and my dearest… pic.twitter.com/sj3rtExmnp
ఇటీవలే ఎన్టీఆర్ తో కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ సినిమాను (NTR 31) ప్రకటించిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 9న ఎన్టీఆర్-నీల్ కాంబోలో వస్తోన్న NTR 31 పూజా కార్యక్రమం రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు.మరి NTR 31 రెగ్యులర్ షూటింగ్ ఎప్పటినుండి షురూ కానుందో రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ సినిమాకు 'డ్రాగన్' (Dragon) అనే టైటిల్ పరిశీలనలో ఉంది.